పూర్వము (హంపి) విజయనగర సామ్రాజ్యం రోమ్ నగర వైభవం పోలిండెను
పూర్వము (హంపి) విజయనగర సామ్రాజ్యం రోమన్ సాంర్యాజ్య యొక్క వైభవం పోలిండెను. అంతటి సంపదతో తులతూగిన సామ్రాజ్యం దక్షిణ భారతమున మరొక్కటి లేదు. తుంగభద్రనది తీరానా
శైవ విరుపాక్ష గుడి సన్నిధిలోమహోన్నత సన్యాసి విద్యారన్యుల సూచనమేరకు సోదరులైన హరరాయలు బుక్కరాయలు చేత హిందూ సామ్రాజ్యము 1336 స్థాపించబడేను. దానికి కారణము ఢిల్లీ సుల్తాన్ మహమ్మద్ బీన్ తుగ్లక్ దుష్ట పరిపాలన అంతం చేయడానికే శక్తిని కూడగట్టుకొన్నారు.
వీరిలో శ్రీకృష్ణదేవరాయలు గొప్పవాడు. మహమంత్రి తిమ్మరుసు తోడుగా నిలిచాడు. ఎవరిమాటలోనమ్మి ఏదోనేపముతో నిరధారముగా తన్నభిరుద్ధికి తోడ్పాడిన వ్యక్తి కళ్ళను నిర్దాక్షిణ్యంగా తీయించాడు.
యుద్ధములో తిరుగులేని వీరుడు, ఓటమిఎరుగని మహారాజు శ్రీకృష్ణదేవరాయలు. పరిపాలన దక్షుడు, కవిపోషకుడు ఆముక్తామాల్యాదను రచించి ఆంధ్రబోజుడుగా పేరుగాంచెను. రాజ్యవిస్తరణలో దిట్ట. ఒడిస్సాగజపతులను ఆ రాజుకుమార్తెను వివాహమాడెను. రాయచూరు నవాబుల నిరంతరము యుద్ధము గావించేను. వజ్రాలు మణిమాణిక్యాలు రాసులుపొసి సంతలో అమ్మారు. విదేశీయులతో వాణిజ్యము కొనసాగించారు.
శ్రీకృష్ణదేవరాయలు కుమారుడు విశప్రయోగము చేయబడి మరణించిన తర్వాత కృంగి కృషించిపోయాడు.
అతని తర్వాత అల్లుడు అలియరామరాయలు అధికారంలోకి వచ్చాడు. ఇతడు యుక్తిపరడు, శక్తివంతుడు.
1565 తాళ్లికోట యుద్ధంతర్వాత తర్వాత, శిథిల శిల్పాలే నిదర్శనముగా నిలిచాయి. అళియ రామరాయలు బహమిని సుల్తానుల కూటమితో ఓడిపోయాక సంపద (అత్యంత విలువకలిగిన వజ్ర వైడ్యూరాలు దోచుకోవడం కాకుండా గుడి శిల్పాలను అంత్యంత కృరంగా ధ్వంశం చేసి వెళ్లిపోయారు.
హంపికి విచ్చేసిన ప్రపంచయాత్రికులు తమగ్రంధములో ఈ విషయాలు క్రొడిరించక పోయివుంటే మనకు ఈ సామ్రాజ్య చరిత్ర మనకుతెలిసి ఉండేదికాదు. మరుగుపడిన హంపిరాజ్యము గురించి బళ్లారి బ్రిటిష్ అధికారి గ్రంధాలు చదివి వెలికి తీసారు. లేకపోతె మనుకు విజయనగర సమ్రాజము గురుంచి అస్సలుతెలిసేదికాదు.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి